పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం వరకు పోలియో చుక్కలు వేస్తారు. కామారెడ్డిలో 1,02,555 మంది, నిజామాబాద్ జిల్లాలో 1,91,081 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
అపరిశుభ్ర ఆహారం, అపరిశుభ్రంగా ఉండడం, చేతులు, కాళ్లూ సరిగ్గా కడుక్కోకపోవడంతో పోలియో వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది. పోలియోమైలిటిస్ అనే వైర స్ ద్వారా పోలియో వ్యాధి సోకుతుంది. ఈ వైరస్ కడుపులోకి వెళ్లి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీంతో కదలలేని విధంగా కండరాలు బిగుసుకుపోతాయి. ఇది ఎక్కువగా ఐదేండ్లలోపు పిల్లలకే వస్తుంది. అందుకే ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో వ్యాధి రాకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రభుత్వం పల్స్ పోలియో చుక్కలను వేయిస్తున్నది. తల్లిదండ్రులు తప్పకుండా అప్పుడే పుట్టిన చిన్నారి నుం చి మొదలుకొని ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని అధికారులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో పోలియో చుక్కలు వేసేందుకు మొత్తం 638 కేంద్రాలను సి ద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,02,555 చిన్నారులకు పోలియో చుక్కలను వేయనున్నారు. 64 రూట్లలో 638 బూత్లు, 22 బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, 174 హైరిస్క్ ప్రాంతాలు, 22 సంచార బృందాల ద్వారా ఆదివారం పోలియో చుక్కలు వేస్తామని వైద్యాధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేయించుకోని పిల్లలకు వైద్య సిబ్బంది వేస్తారు. పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశవర్కర్లు, విద్యాశాఖకు సంబంధించిన 2,552 మంది సిబ్బందిని నియమించారు. ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఐదేండ్లలోపు 1,91,081 మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు 1007 పల్స్పోలియో బూత్లను ఏర్పాటు చేశామని డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు. 37 ట్రాన్సిట్ బూత్లు, 37 మొబైల్ బూత్లు నెలకొల్పామని, అవసరమైన సిబ్బందిని నియమిస్తూ 2.40లక్షల పో లియో డోస్లను సమకూర్చినట్లు పేర్కొన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అవగాహన కల్పించాం. తల్లిదండ్రులు తప్పకుండా ఐదేండ్లలోపు చిన్నారులను దగ్గరలోని పల్స్ పోలియో కేంద్రానికి తీసుకెళ్లి చుక్కల మందు వేయించాలి.