కామారెడ్డి రూరల్, ఫిబ్రవరి 14: బ్రెయిన్ డెడ్తో మూడు రోజులుగా కోమాలో ఉన్న ఓ కానిస్టేబుల్ బుధవారం మృతిచెందాడు. ఆయన అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి 7వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బెజ్జంకి కార్తీక్ (33) ఆదివారం డ్యూటీ ముగించుకొని బైక్పై కామారెడ్డికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేవునిపల్లిలోని ఆర్యక్షత్రియ భవనం వద్ద కుక్కఅడ్డు రావడంతో తప్పించబోయి కింద పడిపోయాడు.
ఈ ప్రమాదంలో కార్తీక్కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ముందుగా ఆయనను స్థానిక ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని కిమ్స్కు తరలించారు. మూ డు రోజులపాటు కోమాలో ఉన్న ఆయన బుధవారం మృతి చెందాడు. కార్తీక్ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారని ఎస్సై తెలిపారు.