మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు జిల్లా ప్రముఖులు నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు పోరాట యోధుడిని స్మరించుకున్నారు. శివాజీ ధైర్య సాహసాలను గుర్తుచేసుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో యువకులు ‘జై భవానీ.. వీర శివాజీ’ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహించారు.
-నమస్తే తెలంగాణ యంత్రాగం, ఫిబ్రవరి 19