నవీపేట, జనవరి 23: నవీపేట్ మండలం అభంగపట్నంలోని యూనిస్ ట్రేడర్స్ రైస్మిల్ను అధికారులు సీజ్ చేశారు. సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ జగదీశ్వర్, నార్త్ రూరల్ సీఐ సతీశ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి రైస్మిల్పై దాడి చేశారు. ఈ సందర్భంగా డీఎం జగదీశ్వర్, సీఐ సతీశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గతేడాది ప్రభుత్వం 25వేల క్వింటాళ్ల ధాన్యాన్ని నవీపేట మండలం అభంగపట్నం రైస్మిల్కు కేటాయించింది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉండగా రైస్మిల్ యజమాని యూనిస్ పక్కదారి పట్టించారు. ఇందులో సుమారు రూ. 6.18 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. యజమాని యూనిస్పై క్రిమినల్ కేసు నమోదు చేసి రైస్మిల్ను సీజ్ చేసినట్లు తెలిపారు. నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్, సివిల్ సప్లయ్ డీటీ అశ్వక్, సిబ్బంది ఉన్నారు.