డిచ్పల్లి/కామారెడ్డి, ఫిబ్రవరి 9 : టీఎస్డబ్ల్యూఆర్, టీటీడబ్ల్యూఆర్, టీఆర్ఈఐ, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 11న పరీక్ష నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయాధికారిణి సంగీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్టికెట్లు https://tgcet.cgg.gov.in సైట్లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వారికి కేటాయించిన కేంద్రాలకు 11వ తేదీన ఉదయం 10 గంటలలోపు చేరుకోవాలని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 17 సెంటర్లను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్, ప్యాడ్, హాల్ టికెట్ను తప్పకుండా వెంట తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాటు పూర్తిచేసినట్లుకామారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో మొత్తం 3,986 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని ఆయన సూచించారు.