రాజంపేట్, డిసెంబర్ 21 : రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య తల్లి లక్ష్మవ్వ (85) గురువారం తెల్లవారు జామున మృతి చెందారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నది. కాగా లక్ష్మవ్వ అంత్యక్రియలు వారి స్వగ్రామం రాజంపేట్ మండలం శివాయిపల్లిలో నిర్వహించారు. లక్ష్మవ్వ మృతికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో పోలీసు శాఖలో విధులను నిర్వహిస్తున్న కిష్టయ్య తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ప్రాణత్యాగం చేయడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.