నిజామాబాద్ క్రైం, నవంబర్ 26 : ప్రతి మహిళ చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న ఘటనలపై అవగాహన వస్తుందని, విద్యార్థులను ఉన్నత చదువులు చదివించేందుకు కుటుంబీకులు ప్రోత్సహించాలని కామారెడ్డి ఎస్పీ బి.శ్రీనివాస్రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రెండు రోజుల పాటు నిర్వహించిన ఉమెన్ హెల్ప్ డెస్క్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హెల్ప్డెస్క్కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రతి పోలీస్స్టేషన్లో మహిళా సహాయ కేంద్రం ఉంటుందని తెలిపారు. మహిళలకు సంబంధించిన కేసు విష యంలో సున్నితంగా వ్యవహరించాలని, పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, అదనపు ఎస్పీ (డబ్ల్యూఎస్డబ్ల్యూ) హైదరాబాద్ జి.రాజారత్నం, ఏసీపీ శ్రావణ్ కుమార్, కామారెడ్డి జిల్లా ఎస్బీఐ ఎస్.వీరయ్య, రాజ్ కోటి, రమేశ్, మహిళా సేఫ్టీ వింగ్ సీఐ రేణుక, ఉమ్మడి జిల్లా సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.