కామారెడ్డి/ ఖలీల్వాడి, ఏప్రిల్ 11 : ఉమ్మడి జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు సోషల్ పేపర్ పరీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 11,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండ గా..11,872 మంది హాజరైనట్లు డీఈవో రాజు, పరీక్షల విభాగం అధికారి నీలం లింగం తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 21,551 మంది విద్యార్థులకు 21,489 మంది హాజరైనట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 63, నిజామాబాద్ జిల్లాలో 141 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు.. పరీక్షలు ముగియడంతో పరీక్షా కేంద్రాల వద్ద కేరింతలతో సందడి చేశారు. విద్యార్థుల వసతి గృహాలు, బస్టాండ్ల వద్ద రద్దీ నెలకొన్నది. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లడానికి తరలివచ్చారు.