నిజామాబాద్ క్రైం, నవంబర్ 23 : ఖమ్మం జిల్లా ఫా రెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా ఫారెస్టు అధికారులు, సిబ్బంది బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అటవీ శాఖ కార్యాలయంలో శ్రీనివాస్ రావుకు నివాళులు అర్పించారు. నిజామాబాద్, వర్ని, కమ్మర్పల్లి, సిరికొండ, ఆర్మూర్ రేంజ్ల పరిధిలోని ఫారెస్టు సిబ్బంది వర్ని రోడ్డులోని ఫారెస్టు శాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ముందుగా జిల్లా ఫారెస్టు ఆఫీసర్ వికాస్ మీనాకు వినతి ప త్రం అందజేశారు. అనంత రం కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.నాగరాజును కలిసిన ఆఫీసర్స్, సిబ్బంది వినతిపత్రం అందజేశారు. తాము విధులు నిర్వర్తించే సమయంలో తమపై దాడులు జరుగకుండా పోలీస్ ప్రొటక్షన్ కల్పించాలని సీపీకి ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. అందుకు సీపీ నాగరాజు స్పందిస్తూ అవసరమైన చోట తప్పకుండా పోలీస్ టీమ్స్ను ఏర్పాటు చేసి రక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంతే కా కుండా ఫారెస్టు ఆఫీసర్స్, సిబ్బంది అటవీ ప్రాంతంలో విధులు నిర్వహించే సమయంలో వారికి నష్టం చేసే విధంగా ప్రయత్నించినా, ప్రోత్సహించినా వారిపై చట్టరీ త్యా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. సీపీని కలిసిన వారిలో ని జామాబాద్ ఫారెస్టు ఆఫీసర్ పద్మారావు, వర్ని ఫారెస్టు ఆఫీసర్ ఎం.ఏ. హబీబ్, ఇందల్వాయి ఫారెస్టు ఆఫీసర్ హిమచందన, సిరికొండ ఫారె స్టు ఆఫీసర్ ఎం.వీ.నాయక్, జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, కమ్మర్పల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తుకారాం రాథోడ్, భీమ్గల్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దేవిరాజ్తో పాటు అన్ని రేంజ్ల పరిధిలోని ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.