శక్కర్నగర్, డిసెంబర్ 13: బోధన్ మండంలోని ఖండ్గామ్కు చెందిన శ్రీకాంత్ పటేల్ (20) అనే విద్యార్థి మృతదేహం ఈ నెల 12న ఉదయం బోధన్ పట్టణ శివారులోని పసుపువాగు ఒర్రెలో కుళ్లిన స్థితిలో లభ్యం కావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 80 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి పోయిన తమ కుమారుడు మృతిపై తండ్రి లక్ష్మణ్ పటేల్, తల్లి జ్యోతి, సోదరుడు, బంధువులు బోధన్-రుద్రూర్ రహదారిపై రాస్తారోకో దిగారు. రాత్రంతా రోడ్డుపైనే ఉన్న కు టుంబీకులను పోలీసులు మంగళవారం తెల్లవారు జామున నచ్చజెప్పి రెంజల్ పోలీస్ స్టేషన్కు తర లించారు.
ఈ సంఘటనలో తమకు సహకరిస్తే అసలు విషయాలు బయటికి వస్తాయని పోలీసు అధికారులు నచ్చచెప్పడంతో శ్రీకాంత్ పటేల్ తండ్రి లక్ష్మణ్ పటేల్ ఫిర్యాదు మేరకు వైద్య సిబ్బంది అస్తికలు, వెంట్రు కలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపేందుకు తీసు కెళ్లారు. రాత్రంతా పోలీసుల కాపలా మధ్య మృత దేహం ఉండగా, మంగళవారం పలువురి సమక్షంలో జిల్లా మెడికల్ కళాశాల వైద్య బృందం మృతదేహానికి చెందిన వివిధ భాగాలను సేకరించారు. ఈ ప్రాంతంలో బోధన్ పట్టణ, రూరల్ సీఐలు బీడీ ప్రేమ్కుమార్, జి. శ్రీనివాసరాజు, రుద్రూర్ సీఐ జాన్ రెడ్డి తో పాటు ఎస్బీ సీఐ శ్రీశైలం, పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు. సంఘటనా స్థలానికి బయటి వ్యక్తులు రాకుండా చర్యలు చేపట్టారు.
విద్యార్థి మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం: సీపీ
శ్రీకాంత్ పటేల్ మృతి బాధాకరమని సీపీ నాగరాజు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సం ఘటనలో నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని, మృతుని కుటుంబీకులు ఆరోపించిన వ్యక్తులు ఎవరైనా, ఫోరెన్సిక్ నివేదిక అనంతరం వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. మొదట అదృశ్యంగా కేసు నమోదు చేశామని, తిరిగి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సంఘటనలో మృతుని కుటుంబీకులను బెదిరింపు చర్యలకు పాల్పడిన వ్యక్తులతో ఓ పోలీస్ అధికారి మందు సేవించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని, సదరు వ్యక్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ నాగరాజు వెల్లడించారు. ఈ సంఘటనలో స్థానిక పోలీసులపై వచ్చిన అభియోగాల మేరకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ అధికారుల బృందాన్ని నియమించామన్నారు. డీసీపీ అరవింద్బాబు ఆధ్వర్యంలో సీసీఎస్ ఏసీపీ రమేశ్, ఏసీపీ రాజశేఖర్లతో కలిసి ఈ సంఘటనపై విచారణ జరిపించనున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఒకవేళ మృతుడి ఫోన్ లభ్యం అయితే, దాని ద్వారా కూడా సాంకేతికంగా విచారణ జరిపించి బాధ్యులను గుర్తిస్తామని సీపీ స్పష్టం చేశారు.