వర్ని, మార్చి 25: మండలంలోని సిద్ధ్దాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి.. అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే జూన్, జూలైలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధ్దాపూర్ రిజర్వాయర్ కింద సుమారు 500 ఎకరాల అటవీ భూమి ముంపునకు గురువుతున్నదని తెలిపారు. మరో 200 ఎకరాల్లో రిజర్వాయర్కు అవసరమైన మొరం తవ్వకాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు అటవీశాఖకు 750 ఎకరాల రెవెన్యూ భూమిని అప్పగించాల్సి ఉందని, ఈ మేరకు జిల్లా కలెక్టర్, అటవీ శాఖ, ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జాకోర, చందూరు ఎత్తిపోతల పథకం పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయని, పైప్లైన్ పనులు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. అనంతరం లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సభాపతి వెంట నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రాజేశ్వర్, డీఎఫ్వో వికాస్ మీనా, వర్ని జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లాలి గిరి, మేక వీర్రాజు, దశరథ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.
ప్రతిపక్ష పార్టీ నాయకుడిపై చిన్న కారణంతో అనర్హ త వేటు వేయడం అప్రజాస్వామికమని స్పీకర్ పో చారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అ గ్రనేత రాహుల్గాంధీపై విధించిన అనర్హత వేటు ను వెంటనే ఎత్తివేయాలని స్పీకర్ హోదాలో తాను రా ష్ట్రపతిని కోరుతున్నానన్నారు. ప్రతిపక్ష హోదా లో ఉన్న వ్యక్తిని చిన్న కారణంతో వేటు వేశారని, ఇది అప్రజాస్వామికమని అన్నారు. ఆయనపై వేసిన అ నర్హత వేటును తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో చట్టం తన పని తాను చేస్తుందని స్పీకర్ పోచారం అన్నారు. నింది తులను ఇప్పటికే పట్టుకున్నారని గుర్తుచేశారు. కొం దరు దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకే పని కట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.