బాన్సువాడ, జనవరి 4 : నేరాల నియంత్రణలో భాగంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బాన్సువాడ పట్ణణ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది ప్రమాద కేసులు చాలా మేరకు తగ్గుముఖం పట్టాయని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోన్ యాప్లు తదితర మోసాలు చేసేందుకు ప్రయత్నం చేసే వారిని నమ్మవద్దన్నారు. రికార్డులను పరిశీలించిన ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రతి వీధిలో కెమెరాలు బిగించి ఉన్నాయని, ఎటువంటి నేరాలకు పాల్పడినా ఇట్టే తెలిసిపోతుందన్నారు. బ్యాంకులు, ఏటీఎం తదితర ప్రాంతాల నుంచి డబ్బులు తీసుకెళ్లేవారు జాగ్రత్తలు వహించాలని, పోలీస్ సిబ్బంది ఆయా పరిసర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. నేరాల నియంత్రణలో భాగంగా అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ వెంట పట్టణ సీఐ మహేందర్ రెడ్డి, ఏఎస్సై రవీందర్, సిబ్బంది ఉన్నారు.