కామారెడ్డి, ఫిబ్రవరి 18 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడారం జాతరకు కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు 58 ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నామని మేనేజర్ ఇందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బస్సులు మేడారం వెళ్తున్నందున డిపో పరిధిలో రద్దీ తక్కువగా ఉన్న గ్రామాలకు తక్కువగా నడుపుతామని, ప్రజలు సహకరించాలని కోరారు.