మోర్తాడ్, మార్చి16: గ్రామాల అభివృద్ధి సీఎం కేసీఆర్ ధ్యేయమని వక్తలు అన్నారు. పలు మండలాల్లో సీసీ రోడ్డు పనులను గురువారం ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతోనే మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా అన్నారు. గురువారం మోర్తాడ్లో రూ.50లక్షలు, వడ్యాట్లో రూ.15లక్షలు, పాలెంలో రూ.15లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్స దేవన్న, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ పాపాయి పవన్, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు సత్యనారాయణ, సర్పంచులు బోగ ధరణి, వెల్మరూప, సంతోష్, ఎంపీటీసీలు రాజ్పాల్, లక్ష్మి, గందం మహిపాల్, జేసీ గంగారెడ్డి, రమేశ్, మల్లేశ్, హన్మంతు, మహేశ్ పాల్గొన్నారు.
బోధన్ రూరల్, మార్చి 11: బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ రామావత్ రాజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 15 లక్షల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి సురేశ్, గ్రామ పెద్దలు బుర్రిలక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
బాల్కొండ, మార్చి 16: మండలంలోని జలాల్పూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో మంజూరైన రూ.35 లక్షలతో రంగనాథం స్వామి ఆలయానికి సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీ పనులను బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. కార్యక్రామంలో సర్పంచ్ కల్పన లనిల్, జడ్పీటీసీ లావణ్య వెంకటేశ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ సూరజ్రెడ్డి పాల్గొన్నారు.
కమ్మర్పల్లి, మార్చి16: ఉప్లూర్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను బద్దం పద్మా చిన్నారెడ్డి ప్రారంభించారు. రూ.55 లక్షల నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ రేగుంట దేవేందర్, పార్టీ యువజన విభాగం నాయకులు చిన్నారెడ్డి, ఎంపీటీసీ పిప్పెర్ అనీల్ తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్, మార్చి16: గుంజిలిలో సీసీ రోడ్ల పనులకు సర్పంచ్ గుండారం శేఖర్, బీఆర్ఎస్ నాయకులు రంజిత్, భూషణ్ భూమిపూజ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాల్ద లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు శివరామకృష్ణాగౌడ్, అడేందర్, కిరణ్, గోపి, వార్డు సభ్యులు తదితరులు పాల్గోన్నారు.