మాక్లూర్, ఫిబ్రవరి 2: ప్రత్యేకాధికారులుగా నియమితులైన ఆఫీసర్లు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు.
శుక్రవారం మాక్లూర్ ప్రత్యేకాధికారిగా ఎంపీడీవో జైక్రాంతి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జడ్పీ చైర్మన్ ప్రత్యేకాధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ షబ్బీర్, డీటీ పద్మలత, పశువైద్యాధికారిణి ఉమామసాహేర్, ఏపీవో ఓంకార్, అశోక్రావు, కోఆప్షన్సభ్యుడు హైమద్, ఎంపీటీసీ వెంకటేశ్వర్రావు, కార్యదర్శులు పాల్గొన్నారు.