బాన్సువాడ రూరల్, డిసెంబర్ 2 : జనవరి 7 నుంచి బెంగళూరులో నిర్వహించే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీరాం నారాయణ్ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రవి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థికి ఎంపికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అధ్యాపకులతో కలిసి అందజేశారు. గత నెల 30న తెలంగాణ యునివర్సిటీలో నిర్వహించిన సౌత్ జోనల్ ఇంటర్ సీటీ యునివర్సిటీ కబడ్డీ సెలక్షన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఆయన తెలిపారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడంతో పీడీ వెంకటేశంను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కృష్ణా, విఠల్, శంకర్, సుధాకర్రావు, అంబయ్య, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ విశ్వ విద్యాలయం నిజామాబాద్లో జాతీయ స్థాయి పోటీలకు నిర్వహించిన ఎంపికలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరవింద్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ కిష్టయ్య తెలిపారు. ఎంపికైన విద్యార్థి డిసెంబర్ 21వ తేదీన చెన్నైలో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. జాతీయి స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని కళాశాల సిబ్బంది ఆకాం క్షించారు.