మాక్లూర్/భీమ్గల్/ నవీపేట/ మోర్తాడ్, నవంబర్ 24: మాక్లూర్ మండల కేంద్రంతోపాటు చిన్నాపూర్ గ్రామంలో పలువురికి సర్పంచులు అశోక్రావు, పుప్పాల లక్ష్మీ సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను గురువారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కో-ఆప్షన్ సభ్యుడు అహ్మద్, ఎంపీటీసీ వెంకటేశ్వర్రావు, ఉపసర్పంచులు అనిత, ఎస్కె.అహ్మద్, నాయకులు గంగారెడ్డి, రాజు, లక్ష్మీనారాయణ, మారుతి, హబీబ్, లక్ష్మణ్, సాయిలు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 27 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 14 లక్షలు మంజూరుకాగా, సంబంధించిన చెక్కులను జడ్పీటీసీ చౌట్పల్లి రవి గురువారం అందజేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, రైతుబంధుసమితి మండల కన్వీనర్ శర్మానాయక్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎంఎ.మొయీజ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తుక్కాజీనాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవీపేట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కసిరే సాయిలుకు సర్పంచ్ బత్తూర్ సాయిలు రూ.37 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో అదే గ్రామానికి చెందిన మన్నెగుండ్ల రాజగంగుకు రూ.35వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్సదేవన్న, సర్పంచ్ దేవన్న గురువారం అందజేశారు. ఉప సర్పంచ్ రమేశ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ముత్యాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.