తాడ్వాయి, డిసెంబర్ 5: మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత 52వ వార్షిక మహోత్సవాలను బుధవారం నుంచి నిర్వహించడానికి ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాలను బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. దత్తాత్రేయ జ యంతి సందర్భంగా 7వ తేదీ బుధవారం ఉదయం నాలు గు గంటలకు సుప్రభాతం, ధ్యానం, 7.45గంటలకు గో మాతపూజ, 8.15గంటలకు ధ్వజారోహణం, 9.30 గంటలకు శబరిమాతాజీ భక్తుల దీక్షలు, సాయంత్రం 7.15 కు దత్తాత్రేయుడి డోలారోహణం, 8.00 గంటలకు రథోత్స వం, రాత్రి 9.30 గంటల నుంచి భక్తుల సందేశాలు, భజనలు,సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
8న గురువారం ఉదయం 4.15గంటలకు సుప్రభాతం, ధ్యానం, 8.35 గంటలకు పరపపూజ్య సదర్గు శబరిమాతాజీ దివ్యపాదుకులతో గ్రామంలో ఊరేగింపు, 11.30 గంటలకు అశ్రమం ఎదుట ఉన్న గుట్టపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన సద్గురు శబరిమాతాజీ దివ్య పాదుకా పూజోత్సవం, తీర్థ ప్రసాద వితరణ, 3.30 గంటలకు మహత్ముల సందేశం, భజన, నామ సంకీర్తనలు ఉంటాయి.
రాత్రి 9.30గంటల నుంచి తాడ్వాయి, కరీంనగర్, మెదక్, ఎండ్రియాల్, కామారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, మ హారాష్ట్ర, నిజామాబాద్కు చెందిన భక్త బృందాలతో తెల్లవా రు జాము వరకు భజనలు, పాటలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు అన్నదానంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించామని, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆశ్రమ కమిటీ బాధ్యులు కోరారు.