బోధన్ రూరల్: రైతులు సాగులో పంట మార్పిడి పద్ధతిని పాటించాలని కేవీకే (కృషి విజ్ఞాన కేంద్రం) శాస్త్రవేత్తలు అన్నారు. బుధవారం బోధన్ మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త నవీన్కుమార్ మాట్లాడుతూ కేవీకే ద్వారా అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక ముఖ్యఉద్దేశాన్నివివరించారు.
వ్యవసాయంలో నూతన పద్ధతుల ద్వారా ఖర్చును తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవీకే ద్వారా అందిస్తున్నామన్నారు. జలశక్తి అభియన్ కార్యక్రమంలో భాగంగా నీటి వృథాను అరికట్టి సంరక్షించాలన్నారు. వ్యవసాయంలో నీటి వినియోగ పద్ధతుల గురించి రైతులతో చర్చించారు. సాగులో ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పంట మార్పిడి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ వ్యవసాయ అధికారి సంతోష్నాయక్, గ్రామ సర్పంచ్ లక్ష్మి, కేవీకే శాస్త్రవేత్తలు వెంకట్రాజ్ కుమార్, శ్వేత, సురేశ్, విజయ్కమార్, వ్యవసాయ విస్తరణ అధికారి అనుజ, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.