ఆర్మూర్: ఆర్మూర్ సొసైటీ పరిధిలోని ఆర్మూర్, రాంపూర్, మిర్ధాపల్లికి చెందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ చైర్మన్ కాపెల్లి చిన్న ముత్తెన్న, వైస్ చైర్మన్ నర్మె నవీన్ కోరారు. ఈ నెల 29లోపు పట్టాదారు పాస్బుక్లతో సంబంధిత వ్యవసాయాధికారులకు రైతుబీమా కోసం అర్జీ పెట్టుకోవాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను వ్యవసాయ విస్తీర్ణాధికారులకు అందజేయాలని తెలిపారు.