నిజామాబాద్ రూరల్/ ధర్పల్లి, ఫిబ్రవరి 26 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన మున్నూరుకాపు కులస్తుల కమ్యూనిటీ భవనానికి రూ.5 లక్షలు, దాశరథి కులస్తుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5లక్షలు, క్రైస్తవుల చర్చి నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను నిజామాబాద్లోని ఆయన నివాసంలో స్థానిక ప్రజాప్రతినిధులకు ఆదివారం అందజేశారు. ప్రొసీడింగ్ కాపీలను అందజేసినందుకు ఆయా కుల సంఘాల పెద్దలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే బాజిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, మండల నాయకులు ప్రేమ్దాస్నాయక్, గోపాల్నాయక్, సర్పంచులు నగేశ్, అశోక్, నాయకులు గాజుల శంకర్, బాల్రాజ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లి మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రూ.5 లక్షల ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్లహన్మంత్రెడ్డి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కలిశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే వారికి నిధులను మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇందల్వాయి, ఫిబ్రవరి 26 : మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన మహ్మద్ హజ్రత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాధితుడికి బీఆర్ఎస్ సభ్యత్వం ఉండడంతో పార్టీ నుంచి రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. అనంతరం పలు కుల సంఘాలకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్ నాయక్, జడ్పీటీసీ సభ్యురాలు సుమనారెడ్డి, వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, మండల అధ్యక్షుడు చిలివేరి దాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్, సర్పంచ్ నోముల విజయలక్ష్మారెడ్డి, కార్యదర్శి పులి శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు వసంత, పార్టీ సీనియర్ నాయకులు అరటి రఘు, బూసాని మహేశ్, సాంబారి గంగరాజు, విఠల్, తీగల అశోక్, ఎడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయి, ఫిబ్రవరి 26 : ఇందల్వాయి మండలంలోని చిన్నవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పరిశీలించారు. జాతీయ రహదారి నుంచి వెళ్లే దారిలో గన్నారం బ్రిడ్జిని సైతం పరిశీలించి నిధులు మంజూరు అయ్యే విధంగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
మోపాల్ (ఖలీల్వాడి), ఫిబ్రవరి 26 : మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలోని రామన్ చెరువు (దయ్యాలకుంట)లో పూడిక తీయించి, చేపలను వదిలి తమకు ఉపాధి కల్పించాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను గంగపుత్ర సంఘం ప్రతినిధులు కోరారు. ఎంపీపీ లతా కన్నేరాం, ఎంపీటీసీ సభ్యుడు రమేశ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్కు వారు వినతిపత్రాన్ని అందజేశారు.