నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు. జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధలు, తదితరులు పాల్గొన్నారు.