డిచ్పల్లి, డిసెంబర్ 5: మట్టి లేకపోతే ఆహారం లేదని, ఆహారం లేకపోతే జీవం లేదని, ఈ మట్టి సర్వజీవులకు ఆధారమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్ని జన్మలెత్తినా తల్లిలాంటి భూమి రుణాన్ని తీర్చుకోలేమని పేర్కొన్నారు. పంటల మార్పిడి పాటిస్తూ భూసారం కాపాడుకోవాలని, రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టిసారించాలని సూచించారు. మండంలోని బర్ధిపూర్ గ్రామ రైతువేదికలో సోమవారం నిర్వహించిన ప్రపంచ మృత్తికా దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రైతులు పోటాపోటీగా రసాయనాలు వినియోగించడంతో భూసారం దెబ్బతింటున్నదని అన్నారు.
వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ రైతులు పట్టించకోవడంలేదన్నారు. రసాయన ఉత్పాదకాల వినియోగంతో నేల స్వభావమే మారిపోతుందన్నారు. సేంద్రియ పద్ధతితో పంటలను సాగుచేస్తే భూసారిన్ని పరిరక్షించడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారవుతారని అన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి నేలను అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. వరి కాకుండా చిరుధాన్యాలు, కూరగాయలు ముఖ్యంగా ఆయిల్పామ్ సాగుపై అందిస్తున్న సబ్సిడీని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఏడీఏ ప్రదీప్కుమార్, జడ్పీటీసీ దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, సర్పంచులు సృజన, మమత, లింగం, గణేశ్, మల్లేశ్, ఏఈవోలు అశ్రిత, భావన, రూపేశ్, సొసైటీ చైర్మన్ జైపాల్, ఎంపీటీసీలు కృష్ణవేణీసాయిలు, బాలగంగాధర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సాయిలు, నాయకులు కృష్ణ, పద్మారావు, ఆమేర్, రైతులు పాల్గొన్నారు.