వినాయక్నగర్, మార్చి 30: నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ. 4లక్షల 8వేల 910 నగదును సీజ్ చేశామని ఎస్హెచ్వో విజయ్బాబు తెలిపారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో కుమార్గల్లీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా శివప్రసాద్ అనే వ్యక్తి ఆధారాలు లేకుండా డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు.