ముప్కాల్ (మెండోరా), ఏప్రిల్ 10: కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని, రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళ్తారన్నారు. మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ హయాంలో కృషి చేశామన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్స్ను ఏర్పాటు చేసి ముస్లిముల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించినట్లు గుర్తుచేశారు.
కులమతాలకు అతీతంగా బీఆర్ఎస్ పాలన చేపట్టింద న్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి పనులకు మున్ముందు కూడా తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం ముస్లిములకు పండ్లు తినిపించిన వేముల.. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్ రెడ్డి, జడ్పీటీసీ గంగాధర్, ఎంపీపీ బురుకల సుకన్యాకమలాకర్, తాజా మాజీ సర్పంచ్ మిస్బావొద్దీన్, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రాజు, రామాలయ మాజీ చైర్మన్ అనిల్, ముస్లిములు పాల్గొన్నారు.