బోధన్, మార్చి 13: బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా అవార్డు ప్రకటించింది.
గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా సరోజనమ్మ అవార్డును అందుకోనున్నారు. మరణానంతరం తన ఆస్తిని సామాజిక సేవా కార్యక్రమాల కోసం, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్కు ఆమె విరాళంగా ఇచ్చారు.