నాగిరెడ్డిపేట్, జనవరి 1 : మండలంలోని పోచా రం ప్రాజెక్టు నుంచి ఆయకట్టు అవసరాల కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ శనివారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నిండుకుండలా ఉండడంతో జోన్ బీ రైతుల కోసం నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని.. రైతులు నీటిని పొదుపుగా వాడుకొని చివరి ఆయకట్టు రైతులకు అందే విధంగా సహకరించాలని కోరారు. నీటి విడుదల 15 రోజుల పాటు కొనసాగుతుందని, అనంతరం 10 రోజులు నిలిపి వేసి తిరిగి 15 రోజుల పాటు విడుదల చేస్తామని ప్రాజెక్టు డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజదాస్, జడ్పీటీసీ సభ్యుడు మనోహర్రెడ్డి, ఎల్లారెడ్డి మా ర్కెట్ కమిటీ చైర్పర్సన్ బోయిని రాధ, మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, సింగిల్ విండో చైర్మన్లు నర్సింహులు, గంగారెడ్డి, సర్పంచులు విజితారెడ్డి, వంజరి సునీత, కిచ్చయ్యగారి సునీత, పోచారం ఎంపీటీసీ వినిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్ధయ్య, నాయకులు బోయిని విఠల్, మంగళి యాదగిరి, కిరణ్, వెంకట్రెడ్డి, సంతోష్ గౌడ్, రాజారెడ్డి, తిమ్మారెడ్డి సర్పంచ్ అబ్దుల్ అలీ తదితరులు ఉన్నారు.