ఎల్లారెడ్డి (లింగంపేట్), జూలై 18: గ్రామ శివారులోని భూములను కొందరు కబ్జా చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని రాంపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో నిరసన తెలిపి, అనంతరం తహసీల్దార్ సురేశ్కు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ…. గ్రామ శివారులో ఉన్న బురుజుగుట్టలో కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. అంతేగాకుండా ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే కబ్జాల నుంచి గ్రామాన్ని కాపాడాలని, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.