మాక్లూర్, డిసెంబర్ 4: మండలంలోని అడవి మామిడిపల్లి రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన రక్షణ స్తంభాన్ని ఆదివారం లారీ ఢీకొట్టింది. దీంతో 63వ నంబర్ జాతీయ రహదారిపై సుమారు రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
రోడ్డుకు అడ్డంగా విరిగి పడిన స్తంభాన్ని భారీ క్రేన్ సాయంతో తొలగించారు. సర్పంచ్ చింత మల్లారెడ్డి గ్రామస్తుల సహకారంతో ట్రాఫిక్ను క్లియర్ చేశారు.