కామారెడ్డి, మార్చి 22: ఓ బాలికతో పట్టణంలో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేసినట్లు టౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం తెలిపారు. కామారెడ్డి పట్టణంలో తల్లిదండ్రులు లేని ఓ బాలికను ఆమె చిన్నమ్మ వద్ద నుంచి సంపంగి లక్ష్మి, సుంకరి శంకర్ కొనుగోలు చేశారని చెప్పారు. సహజీవనం చేస్తున్న వీరు సదరు బాలికతో స్థానిక శ్రీనివాస్ లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్నారని తెలిపారు. లక్ష్మి, సుంకరి శంకర్తోపాటు లాడ్జి యజమాని నరసింహారెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.