Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వర్ణకార సంఘం భవనంలో ఆయన చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి మారోజు సుధాకర్ చారి, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు హనుమాన్లు చారి మాట్లాడుతూ జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రధాన సిద్ధాంతకర్త అని గుర్తు చేశారు.
తన జీవితాన్ని ప్రాంతీయ హక్కుల పరిరక్షణకు అంకితం చేశారని, కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సిలర్గా పనిచేసిన గొప్ప విద్యావేత్త అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం నాయకులు త్రివేణి నాగరాజు చారి, నారోజు వెంకట రమణాచారి, కన్నోజ్వర్ బాలాజీ చారీ, హుంసా ధర్మపురి చారి, కందుకూరు సత్యనారాయణ చారి, నాగ బ్రహ్మచారి, నరేష్ చారి, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.