వినాయక్ నగర్, సెప్టెంబర్18 : నిజామాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదుల కోసం హైదరాబాద్కు చెందిన ప్రోబ్ల్యాబ్ ఫోరెన్సిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రీయ సేవల ద్వారా న్యాయవాద వృత్తిని పురోగమించడం అనే శీర్షికతో ఈ విజ్ఞానదాయకమైన సెషన్ను న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ సెషన్లో, ప్రోబ్ల్యాబ్ ఫోరెన్సిక్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ ఎర్రగొల్ల, సాక్ష్యాలను బలోపేతం చేయడంలో సమర్థవంతమైన న్యాయ పరిపాలనలో న్యాయవాదులకు సహాయపడటంలో ఫోరెన్సిక్ సైన్స్ / శాస్త్రీయ నిపుణుల సేవల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీలకాంత్ రావు, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, జనరల్ సెక్రటరీ సుభాష్ రెడ్డి, సీనియర్, జూనియర్ విద్వాంసులైన న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు ఫోరెన్సిక్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ ద్వారా మరిన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.