నిజామాబాద్ క్రైం, ఆగస్టు 26 : నిజామాబాద్ జిల్లాలో సెస్టెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన నేపథ్యంలో అవసరమైన బందోబస్తు ఏర్పాట్లను సీపీ కె.ఆర్.నాగరాజు శుక్రవారం పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో హెలీప్యాడ్ స్థలం, కొత్త కలెక్టరేట్ భవనం, గిరిరాజ్ కళాశాల గ్రౌండ్లోని పబ్లిక్ మీటింగ్ స్థలం, టీఆర్ఎస్ నూతన భవనాన్ని
ఈ సందర్భంగా సీపీ నాగరాజు పరిశీలించారు. సీఎం పర్యటన ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి.అరవింద్ బాబు, నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీహరి, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్తో పాటు ఇతర ఎస్సైలు,సిబ్బంది ఉన్నారు.Preparation for ‘s visit reviewed