విద్యానగర్, జనవరి 9 : ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పెండింగ్ లేకుండా చూడాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖకు 53, సివిల్ సప్లయీస్-2, డీఈవో 1, డీపీవో 7, విద్యుత్ 1, ఇరిగేషన్ 2, ఎల్డీఎం 2, మున్సిపల్ 12, డీఆర్డీవో 6, ట్రాన్స్పోర్టు 1, ఎస్పీ 2, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 3, డీబ్ల్యూవోకు 2 చొప్పున మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, వెంకటేశ్ ధోత్రే, ట్రైనీ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఆర్డీవో సాయన్న, ఏవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.