దాడిలో సంస్థ ఆర్గనైజర్ అరెస్టు
నాన్చాకులు, సాహిత్యం లభ్యం
వివరాలు వెల్లడించిన డీసీపీ అరవింద్ బాబు
నిజామాబాద్ క్రైం, జూలై 4 : దేశంలో అశాంతిని సృష్టిస్తూ, హింసాయుత కార్యకలాపాలకు పాల్పడుతున్న నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్న ఓ నిందితుడిని నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ అదనపు డీసీపీ అరవింద్ బాబు వివరాలను వెల్లడించారు. నిషేధిత సిమీ సంస్థకు అనుబంధంగా ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలను జిల్లాలో వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ సంస్థను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నడుపుతున్న ఓ ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామన్నారు. స్థానిక ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్ ఖాదిర్ స్థానికంగా మార్షల్ ఆర్ట్స్(కరాటే) శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు.
జగిత్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్ ఏరియాకు చెందిన ఖాదిర్ కొంత కాలంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ ప్రాంతంలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ యువకులకు మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఇతర మతస్తులపై దాడి చేయడం, దేశంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, కర్ర సాము, నాన్చాక్ తిప్పడంలాంటి వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు తమ విచారణలో తేలిందని అదనపు డీసీపీ వెల్లడించారు. ప్రధానంగా ఈ పీఎఫ్ఐ సంస్థలో శిక్షణ పొందిన యువకులను ఇస్లామ్కు అనువైన శక్తులుగా తయారు చేస్తుంటారని తెలిపారు. వీరిని దేశంలో ఇతర మతస్తులపైకి ఊసిగొల్పి లౌకిక శక్తులను నాశనం చేసి షరియత్ వ్యవస్థను స్థాపించడమే పీఎఫ్ఐ సంస్థ ముఖ్య ఉద్దేశంగా పని చేస్తుదన్నారు. జిల్లా కేంద్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఆదేశాలతో ఏసీపీ వెంకటేశ్వర్ పర్యవేక్షణలో సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ పి.శ్రీశైలం ఆధ్వర్యంలో ఆరో టౌన్ ఎస్సై టి.సాయికుమార్, రూర ల్ ఎస్సై జి.లింబాద్రి, మోపాల్ ఎస్సై మహేశ్ బృం దం ఈ సంస్థలో సభ్యులను తయారు చేస్తున్న అబ్దుల్ ఖాదిర్ ఉండే ఇంటి పై దాడులు నిర్వహించినట్లు అదనపు డీసీపీ తెలిపారు.నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నాన్చాకులు,కర్రలు, వెదురు బొంగులు, సాహిత్యం, బ్యా నర్లు, బస్సు, ట్రైన్ టికెట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్, సీఐలు శ్రీశైలం, నరేశ్, ఎస్సైలు సాయికుమార్, లింబాద్రి, మహేశ్ సిబ్బంది పాల్గొన్నారు.
200 మందికి శిక్షణ
నిందితుడు రెండు నుంచి మూడు సంవత్సరాల కాలంలో నిజామాబాద్ నగరంలో సుమారు 200 మందికి శిక్షణ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తే లింది. అయితే శిక్షణ పొందిన యువకులు ఎక్కడి వారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారనే దానిపై విచారణకు పోలీసులు కార్యాచరణ సిద్ధం చేశారు. సంస్థ ను నడిపేందుకు వారికి ఫండ్(డబ్బులు)ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పంపుతారు, తెర వెనుక ఉన్న వ్యక్తులను బయటికి తీసేందుకు సైతం పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.