మోర్తాడ్/ వినాయక్నగర్, ఫిబ్రవరి 6: నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమంగా దొరికాడు. మోర్తా డ్ మండల కేంద్రం శివారులోని డంపింగ్ యార్డు వద్ద ఏడాది బాబు బుధవారం దొరికాడు. పారిశుద్ధ్య కార్మికుడు దుర్గయ్యకు పాలెం రోడ్డుపై ఉన్న వరదకాలువ పక్కన ఉన్న డంపింగ్యార్డులో బాలుడు ఏడుస్తూ కనిపించాడు. పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చి దుర్గయ్య బాలుడిని తీసుకువచ్చి కార్యదర్శి రామకృష్ణకు విషయాన్ని తెలియజేయడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉషారాణి, అంగన్వాడీ టీచర్ జ్యోతితో కలిసి బాబును మోర్తాడ్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. విషయం తెలుసుకున్న ఎస్సై అనిల్రెడ్డి నిజామాబాద్ రూరల్ పోలీసులకు అప్పజెప్పారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో బాలుడి కోసం సౌత్ రూరల్ సీఐ సురేశ్కుమార్, ఎస్సై మహేశ్ తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం బాలుడు మోర్తాడ్ పోలీసుల చెంతకు చేరాడు. కిడ్నాప్కు గురైన బాలుడు, నిందితులైన జంట ఫొటోలు పత్రికల్లో రావడంతో ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో బాలుడిని వదిలేసి పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏదీ ఏమైనా కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా దొరకడంతో పోలీసు యంత్రాంగం ఊపీరి పీల్చుకున్నది. బాలుడిని తల్లిదండ్రులు సాయమ్మ, హరిప్రసాద్లకు అప్పగించి, కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.