Police | వినాయక్ నగర్,జూన్ 6 : గత కొంత కాలంగా వివిధ ప్రాంతాలలో నేరాలకు పాల్పడి పోలీసుల కండ్లు కప్పి తిరుగుతున్న పాత నేరస్తుడి కోసం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ప్రాంతాలలో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 24 కేసులలో నాన్ బెయిల్ వారెంట్లు జారీ అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్ రాష్ట్రల పాత నేరస్తుని ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. సదరు నిందితుడిని శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దేగ్లూర్ తాలూకా ఖానాపూర్ గ్రామానికి చెందిన బబ్లు బాలాజీ గైక్వాడ్ అలియాస్ ధన్ల బాబు అనే పాత నేరస్థుడు కామారెడ్డి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. సదరు నేరస్తుడి పై నాన్ బెయిలబుల్ నాన్ బెయిల్ వారెంట్స్ ఉన్నప్పటికీ పోలీసులకు చిక్కకుండా నేరాలు చేస్తూ వెల్లడించారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసులు సదరు నేరస్తుడి కోసం గత కొన్ని సంవత్సరాలుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ చిక్కలేదని సీపీ పేర్కొన్నారు.
ఈ నేరస్తుడు గత రెండు రోజులుగా నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో నేరాలు చేయడానికి తిరుగుతున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కు సమాచారం అందింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు బబ్లు బాలాజీ గైక్వాడ్ ను పట్టుకొని కామారెడ్డి పోలీసు అప్పగించినట్లు తెలియజేశారు. ఈ పాత నేరస్తుడిని పట్టుకునేందుకు నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ కే నాగేంద్ర చారి, సీఐ సురేష్, సిబ్బంది తీవ్రంగా కృషి చేసినట్లు సీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా సీసీఎస్ బృందాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అభినందించారు.