బోధన్/ఎడపల్లి/ఆర్మూర్/రెంజల్, జూలై 29 : సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది స్థానిక దవాఖానల్లో రోగులకు సకాలంలో వైద్య చికిత్సలు అందించాలని, ఏ పీహెచ్సీ పరిధిలో సదరు రోగులు ఉంటారో వారికి అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుదర్శనం అన్నారు. బోధన్ మండలంలోని పెగడాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు.
పెగడాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో భూలక్ష్మిక్యాంప్, కొప్ప ర్గ, ఎరాజ్పల్లి, అమ్దాపూర్, ఊట్పల్లి సబ్ సెంటర్లు ఉన్నాయని, ఈ సబ్ సెంటర్ల రోగులకు ఈ పీహెచ్సీలోనే వైద్య చికిత్సలు అందించాల్సి ఉంటుందన్నారు. ఈ సమీక్షలో ఇన్చార్జి డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సమత, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శంషుద్దీన్, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మోతీ రాం, స్టాఫ్ నర్సు రోజానాయుడు పాల్గొన్నారు. ఎడపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో సుదర్శనం సందర్శించారు. ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. దోమ తెరలను వాడాలని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. డాక్టర్ రాజ్కుమార్, ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ షేక్ జావీద్ బాబా, ఏఎన్ఎం గంగామణి తదితరులు ఉన్నారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రమేశ్ అన్నారు.
ఆర్మూర్ మండలం చేపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దోమలు వ్యాపించకుండా పరిసరాలను శు భ్రంగా ఉంచుకోవాలన్నారు. సర్పంచ్ సాయన్న, మండల హెల్త్ సూపర్వైజర్ సాయి, చేపూర్ పీహెచ్సీ వైద్యాధికారి ప్రత్యూష, పాఠశాల హెచ్ఎం మాధవరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెంజల్ మండల ఆదర్శ పాఠశాల విద్యార్థుల వేసే వ్యాక్సిన్ ప్రక్రియను డీఎంహెచ్ వో సుదర్శనం దగ్గరుండి పరిశీలించారు. ఆయన వెంట మండల వైద్యా ధికారిణి డాక్టర్ ప్రమోదితా, జిల్లా ఆరోగ్య విస్తీర్ణాధికారి గోవర్ధన్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.