కంఠేశ్వర్, మార్చి 26: పార్లమెంట్ ఎన్నికల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు నేతృత్వంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్లో నిర్వహించారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులతోపాటు ఇతర అధికారులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. 6 సెగ్మెంట్లకు రిజర్వు సిబ్బందిని కలుపుకొని మొత్తం 7711 మందితో ర్యాండమైజేషన్ నిర్వహించారు. వీరిలో పీవోలు 2,008 మంది, ఏపీవోలు 2056, ఓపీవోలు 3,647 మంది ఉన్నారు. సిబ్బందికి శిక్షణ ఇస్తామని, వారికి తక్షణమే ఉత్తర్వులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, సీపీవో మల్లికార్జున్, శ్రీకాంత్, ఎన్ఐసీ అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.