బాల్కొండ, డిసెంబర్ 27 : మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవతో గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి చేరవేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్యలింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్యావెంకటేశ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తౌటు గంగాధర్, గ్రామశాఖ అధ్యక్షుడు న్యావనంది సాయన్న, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, సర్పంచ్ చాట్లపల్లి వనజగోవర్ధన్గౌడ్, ఎంపీటీసీ సభ్యురాలు సనుగుల కవితశ్యామ్సుందర్, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఫయాజ్అలీ, ఉపసర్పంచ్ న్యావనంది రాజేందర్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు షేక్ వాహబ్, ఎంపీటీసీలు కన్న పోశెట్టి, అనుగుల రాంరాజ్గౌడ్, సొసైటీ డైరెక్టర్ చిన్నోల్ల దమ్మన్న, రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు మహ్మద్ ఇఫ్తాకరొద్దీన్, వార్డు సభ్యులు న్యావనంది నరేశ్, నాయకులు దుదాటి సూర్యప్రకాశ్, రాజేందర్, సుదీర్, రాజేశ్వర్, తెడ్డు చక్రి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.