ఇందూరు, జూన్ 22 : నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఒలింపిక్ రన్ బుధవారం ఉత్సాహంగా కొనసాగింది. జిల్లా ఒలింపింక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను కలెక్టర్ నారాయణరెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. నగరంలోని రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా నుంచి బడాబజార్, నెహ్రూపార్కులో గాంధీచౌక్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా జిల్లా క్రీడా అథారిటీ మైదానం వరకు ఒలింపిక్ రన్ కొనసాగింది.
నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అరవింద్బాబు, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడిల శ్రీరాములు, కార్యదర్శి లింగన్న, కోశాధికారి బొబ్బిలి నర్సయ్య, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అలుక కిషన్, అమృత్కుమార్, క్రీడా సంఘాల ప్రతినిధులు నరాల సుధాకర్, సంజీవ్రెడ్డి, ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.