
Kotagiri | కోటగిరి, ఫిబ్రవరి 20 : కోటగిరి మండల కేంద్రంలోని కోట కింద గల స్కూల్ పక్కనే ఉన్న పాకూరు పట్టిన మినీ వాటర్ ట్యాంక్ ను సంబంధిత శాఖ అధికారులు స్పందించి దానిని శుభ్రం చేయించారు. ‘‘ట్యాంకు ఇలా.. నీటిని వాడేదెలా..?’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’లో శుక్రవారం ప్రచురితమైంది.
దీంతో మండల అధికారులు స్పందించారు. శుక్రవారం పాకురు కట్టిన మినీ వాటర్ ట్యాంక్ ను సిబ్బంది సాయంతో శుభ్రం చేయించారు. బ్లీచింగ్ పౌడర్ తో ఆ ట్యాంకును కడిగేసి, పరిసరాలను శుభ్రం చేశారు. అధికారులు స్పందించి ట్యాంకును శుభ్రం చేయడంతో స్థానికులు ‘నమస్తేతెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు.