కామారెడ్డి, మార్చి 19: పన్ను చెల్లించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల ఎదుట మున్సిపల్ అధికారులు మంగళవారం నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆస్తి పన్నులో 90 శా తం రాయితీ ఇచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాయితీ పోను మిగిలిన పన్నులను ఈ నెల 31లోపు చెల్లించాలని ఎన్నిసార్లు చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే షాపుల ఎదుట నిరసన తెలుపుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ రవిగోపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్య, బిల్ కలెక్టర్లు సాయిలు, రాజు తదితరులు పాల్గొన్నారు.