మాక్లూర్, డిసెంబర్ 16: సమస్యల సత్వర పరిష్కారానికే ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గురువారం ‘నమస్తే ఒడ్యాట్పల్లి’ నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామంలో తిరుగుతూ సమస్యలు తెలుసుకొని సాధ్యమైనవన్నీ అక్కడే పరిష్కరించారు. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నదని గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు. గ్రామాభివృద్ధి బాగున్నదని సర్పంచ్ను అభినందించారు. అనంతరం వీడీసీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి శాఖల వారీగా వివరాలను తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం అర్హులను గుర్తించాలని తహసీల్దార్కు సూచించారు. తమ శాఖల పరిధిలోని వివరాలను ఎంఈవో రాజగంగారెడ్డి, ఏవో పద్మ, పీఆర్ ఏఈ శ్రీనివాస్ ఎమ్మెల్యేకు వివరించారు. వందశాతం వ్యాక్సినేషన్, గొర్రెల పంపిణీ, శ్మశాన వాటికలు, వాటర్ ట్యాంకుల నిర్మాణం పూర్తిచేయాలని ఎంపీడీవో శ్రీనివాస్కు సూచించారు. అంగన్వాడీ భవనానికి రూ.పది లక్షలు, కురుమ సంఘం భవనానికి రూ.ఐదు లక్షలు, ఒడ్యాటమ్మ ఆలయం వద్ద షెడ్డు నిర్మాణానికి రూ.20లక్షలను మంజూరు చేశారు. దళిత సంఘాల భవనాల కోసం నిధులు ఉన్నాయని, నిర్మించుకోవాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీసుధా రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బడుగు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీ ఒడ్డెన్న, నాయకులు రజినీష్, రాజేశ్వర్, మోహన్, రంజిత్, భూషణ్, చిరంజీవి, హుస్సేన్, మల్లయ్య, జనార్దన్, శ్రీనివాస్, కార్పొరేటర్ రాయిసింగ్, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శంకర్గౌడ్, సత్యనారాయణ, ఉప సర్పంచ్ మహేశ్, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, డీఈ గంగారాం, వైద్యుడు కిరణ్దేశ్పాండే, ఆయా శాఖల అధికారులు శ్రీప్రియ, అనిల్, ఏఈలు జ్ఞానేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.