నిజామాబాద్సిటీ/ఇందూరు/సిరికొండ/ఇందల్వాయి/భీమ్గల్/వేల్పూర్/నందిపేట్, నవంబర్ 28 : సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగ, దళిత, విద్యార్థి సంఘాల నాయకులు నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో ఉన్న ఫూలే విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, బీసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు వేర్వేరుగా నివాళులు అర్పించారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు.
బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్కుమార్ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజాభివృద్ధి అని నమ్మి ఆ దిశగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా ఫూలే అని అన్నారు. సంఘం ప్రధానకార్యదర్శి ఆర్.గోపాలకృష్ణ, ఏ.మోహన్, రాజు, శంకర్, రవీందర్ పాల్గొన్నారు.
సిరికొండ మండలం చీమన్పల్లిలోని బీసీ గురుకులంలో పూలే ఆర్సీవో స్వప్న ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రిన్సిపాల్ సాల్మన్, రావుట్ల పాఠశాల హెచ్ఎం ఎం.బాలయ్య, నూత్పల్లి గురుకులం ప్రిన్సిపాల్ సునీతారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని ఆయా గ్రామాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ బాలుర, బాలికల పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీడీఎస్యూ కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ ఫూలే స్ఫూర్తితో దేశంలో కులోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కో-కన్వీనర్ లత మాట్లాడుతూ జ్యోతిబా ఫూలే మహిళలకు చదువు అందించిన గొప్ప స్ఫూర్తిప్రదాత అని అన్నారు. శేఖర్, మధు, ఆంజనేయులు, ప్రవీణ్, రమ్య, ప్రియ, భువనేశ్వరి, నందిని, భవాని పాల్గొన్నారు.
భీమ్గల్ మండల కేంద్రంలో దళిత, బహుజన సంఘాల నాయకులు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సతీశ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు నవీన్, దళిత నాయకులు ఈశ్వర్, అనంతరావ్, తుక్కాజీ నాయక్, నర్సయ్య, దేవిదాస్, దేవేందర్గౌడ్, శ్రీధర్, అవినాష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ గ్రామంలో ఫూలే చిత్రపటానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బాబురావు, మహిళా సంఘ సభ్యులు నివాళులర్పించారు. మాక్లూర్ మండలంలోని దాస్నగర్లో ఉన్న బీసీ గురుకులంలో మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి ప్రిన్సిపాల్ సంజీవ్రెడ్డితోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులు అర్పించారు.
నందిపేట్ మండలం డొంకేశ్వర్లో అంబేద్కర్ యువజన సంఘం, బీఎస్పీ ఆధ్వర్యంలో ఫూలే విగ్రహానికి నివాళులు అర్పించారు. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సుంకరి నాగరాజు, శంకర్, వీడీసీ సభ్యులు కనకపురం రాములు, సుంకరి సంతోష్, తలారి గంగాధర్, నాగస్వామి పాల్గొన్నారు.