ఆర్మూర్, నవంబర్ 28: ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో ఉన్న సెయింట్పాల్ హైస్కూల్లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలు నిజామాబాద్ జిల్లా బాల్బ్యాడ్మింటన్ అధ్యక్షుడు మానస గణేశ్ అధ్యక్షతన జరిగాయి. సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సికింద్రాబాద్, తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ సంఘం చైర్మన్ ఎం.శ్రీనివాస్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేత జట్లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని, దీంతో నాయకత్వ లక్షణాలు పెం పొందుతాయన్నారు. శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉంటుందన్నారు. బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రవీందర్గౌడ్ మాట్లాడుతూ.. జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ నుంచి 12 వరకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, వీరభద్రరావు, శ్రీనివాస్రావు, సత్తయ్య, దుర్గయ్య, భాస్కర్గౌడ్, బాల్ బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షుడు మానస గణేశ్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్రెడ్డి, రాజేశ్వర్, కృష్ణమూర్తి, సురేందర్, మాధురి, రమణ, వినోద్, అనిల్, ఆనంద్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, పీఈటీలు సంతోష్ ఠాగూర్, చిన్నయ్య, రాజ్కుమార్, నాగేశ్, నిఖిత, రాజేందర్, సునీత, సుకన్య, సురేశ్ పాల్గొన్నారు.
విజేతలు వీరే బాలుర విభాగంలో:
రంగారెడ్డి (ప్రథమస్థానం), కరీంనగర్ (ద్వితీయస్థానం), ఆదిలాబాద్ (తృతీయస్థానం)
బాలికల విభాగంలో:ఖమ్మం (ప్రథమ స్థానం), నిజామాబాద్ (ద్వితీయ స్థానం), వరంగల్ (తృతీయ స్థానం)