ధర్పల్లి/నిజామాబాద్రూరల్/ఇందల్వాయి/సిరికొండ/ జక్రాన్పల్లి/మోపాల్(ఖలీల్వాడి), జనవరి 1 : సీఎం కేసీఆర్ రైతులపాలిట ఆపద్బాంధవుడని ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పేర్కొన్నారు. రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడాన్ని హర్షిస్తూ ఆయా మండలాల్లో సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకం చేశారు.
ధర్పల్లిలోని గాంధీచౌక్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్యాదవ్, వైస్ ఎంపీపీ కె.నవీన్రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, సొసైటీ చైర్మన్లు చెలిమెల చిన్నారెడ్డి, ధర్మయ్యగారి రాజేందర్రెడ్డి, హొన్నాజీపేట్ రాజేందర్రెడ్డి, నాయకులు సురేందర్గౌడ్, గోపాల్నాయక్, శ్రీనివాస్నాయక్, ఎస్పీ లింగం, గంగాదాస్, సురేశ్, భోజేశ్వర్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలం గన్నారం కమాన్ వద్ద ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరా భిషేకం చేశారు. వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాదాస్, ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, తేలు విజయ్, లోలం శేఖర్, పరశురాం, చింతల దాసు, పాశం కుమార్, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు రఘునందన్రావు, చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో నిర్వ హించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్య క్షుడు నారవోయిన శ్రీనివాస్, జడ్పీటీసీ మలావత్ మాన్సింగ్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి, నాయకులు మహేందర్, ఆదిత్య, గంగాధర్, గౌస్, సత్యానంద్, మునీర్, రైతులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూర్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుకర్రావు, సీనియర్ నాయ కుడు బాగిర్తి బాగారెడ్డి, ఎంపీపీ బానోత్ అనూష ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొల్లెంక గంగారెడ్డి, సర్పంచులు అశోక్, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్రావు, సురేందర్రెడ్డి, శేఖర్గౌడ్, ఎంపీటీసీలు అంకల గంగాధర్, సుధీర్, స్వామి, సాయన్న, సొసైటీ చైర్మన్ శ్రీధర్, నాయకులు జితేందర్, పిల్లి అశోక్, జమీర్ఖాన్, శ్రీనివాస్రెడ్డి, వడ్ల భూమయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జక్రాన్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో ఎంపీపీ హరిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, వైస్ ఎంపీపీ కుంచాల విమలారాజు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు డీకొండ శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీల చైర్మన్లు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.మోపాల్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.