గాంధారి/ తాడ్వాయి/ నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 16 : జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. గాంధారి మండలకేంద్రంతోపాటు ఉత్తునూర్ ప్రభుత్వ దవాఖాన, మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం 485 మందికి కరోనా టీకాలను వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. 61 మందికి ఫస్ట్ డోస్, 424 మందికి సెకండ్ డోస్ టీకాలను వేసినట్లు వివరించారు. తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. మండలంలోని ఎర్రాపహాడ్ పీహెచ్సీతోపాటు వివిధ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి టీకాలు వేశామని తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 80 శాతం మందికి కొవిడ్ టీకాలు వేశామని తెలిపారు. 18 ఏండ్లు నిండిన వారు టీకా తీసుకోవాలని కోరారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని చీనూర్ గ్రామంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీడీవో రఘు పరిశీలించారు. రేషన్ దుకాణాల వద్ద వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి అర్హులకు టీకాలు వేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ టీకా తీసుకునేలా గ్రామ స్థాయి అధికారులు కృషిచేయాలని ఆయన కోరారు.
కొవిడ్ వ్యాక్సినేషన్పై అవగాహన
కొవిడ్ వ్యాక్సినేషన్తోపాటు మాస్కులు ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై మండలకేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అవగాహన కల్పించినట్లు వారు తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, మాస్కులు ధరించాలని కళాకారులు ఆటపాటల రూపంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాకారులు రమేశ్రావు, ఆకుల మహేందర్, విఠల్రెడ్డి, పోశెట్టి, రాము, కాశీరాం, దివ్యశ్రీ పాల్గొన్నారు.