ఖలీల్వాడి, మార్చి 30: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో టీకా వేసుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ దగ్గరుండి టీకాను వేయిస్తూ ప్రతి ఒక్కరినీ పర్యవేక్షిస్తున్నారు. దవాఖానకు వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేశారు. 45 నుంచి 65 సంవత్సరాల వయస్సుగల వారు ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రతిమారాజ్ సూచించారు. జిల్లాలో మంగళ వారం మొత్తం 16 వందల మందికి గాను 918 మంది కరోనా టీకా వేసుకున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు.