నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 28: జిల్లాలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించా రు. పలు మండలాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల ను జిల్లా అదనపు కలెక్టర్తోపాటు అధికారులు పరిశీలించారు. కోటగిరి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సూపర్స్ప్రెడర్ల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీకా వేసుకున్న తర్వాత కూడా మాస్కును ధరించాలని అన్నారు. టీకా కోసం వచ్చిన వారు కూడా కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని సూచించారు. సెంటర్లో మొత్తం 137 మందికి టీకా వేశామని డాక్టర్ సమత తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, కోటగిరి తహసీల్దార్ శేఖర్, డాక్టర్ విద్య, సమత, వైద్య సిబ్బంది ఉన్నారు. వర్ని మండలకేంద్రంలోని కమ్యూనిటీ దవాఖానలో సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు.
ఆయన వెంట తహసీల్దార్ విఠల్, వైద్యాధికారి వెంకన్న, వైస్ ఎంపీపీ బాలరాజు, ఎస్సై అనిల్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి నగేశ్రెడ్డి ఉన్నారు. వర్నిలోని కమ్యూనిటీ వైద్యశాలలో శుక్రవారం 104 మంది సూపర్స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. రెండో విడుత డోస్ను మరో 32 మందికి వేసినట్లు వెల్లడించారు. మండలంలోని 134 మందిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన ట్లు తహసీల్దార్ విఠల్ తెలిపారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బాలరాజు, మండల వ్యవసాయాధికారి నగేశ్రెడ్డి, ఎస్సై అనిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరికొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డీఆర్డీవో చందర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆర్డీవో రవి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీకా శిబిరాన్ని సూపర్ స్ప్రెడర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోధన్ పట్టణంలో ప్రారంభించిన వ్యాక్సినేషన్ను సూపర్ స్ప్రెడర్లు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఆర్డీవో సోమ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి సూచించారు.
బోధన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆర్డీవో, మున్సిపల్ చైర్పర్సన్ పలువురు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విద్య, డాక్టర్ అంజలీ జామ్కార్, మున్సిపల్ కమిషనర్ రామలింగం, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, కౌన్సిలర్లు తూము శరత్రెడ్డి, అధికారులు దేవేందర్, టీఆర్ఎస్ నాయకుడు చందు ఉన్నారు. బోధన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారు. నవీపేటలోని పీహెచ్సీలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషనేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లత పరిశీలించారు. పలువురు అధికారులు, సూపర్ స్ప్రెడర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. తహసీల్దార్ లత, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ పాల్గొన్నారు. కమ్మర్పల్లి ప్రభుత్వ ప్రాథమిక దవాఖానలో కొవిడ్ తొలి డోసు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 88 మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమాన్ని తహసీల్దార్ బావయ్య, వైద్యుడు నర్సింహస్వామి పర్యవేక్షించారు. భీమ్గల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ ప్రారంభించారు. మండలంలో మొత్తం 274 మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించామని తహసీల్దార్ రాజేందర్ తెలిపారు.
మొదటి రోజు 107 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్, ఆరోగ్య సిబ్బది మారుతి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని జిల్లా వైద్యాధి కారి సుదర్శనం, ఆర్డీవో శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్ తనిఖీ చేశారు. 737 మంది సూపర్స్ప్రెడర్లను గుర్తించామని, వీరిలో 210 మందికి టీకాలు వేశామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. జక్రాన్పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీఎంహెచ్వో బాల నరేంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్, ఎంపీపీ హరిత, జడ్పీటీసీ తనూజ, తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో లక్ష్మణ్, సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీ గంగారెడ్డి, మరియ, ఉప సర్పంచ్ బాలకిషన్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నట్ట భోజన్న పాల్గొన్నారు.